ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా వనపర్తి పట్టణంలోని మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటి ముందు నిరసన చేపట్టారు. సమ్మె శిబిరం నుంచి ర్యాలీగా వచ్చి మంత్రి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటొచ్చి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల మంత్రి పీఏకు వినతిపత్రం అందించి వెనుదిరిగారు. నిరసన కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి: పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?