ETV Bharat / state

చేపల పెంపకంపై ఎమ్​పీఈడీఏ ప్రత్యేక సెమినార్

author img

By

Published : Mar 22, 2021, 2:34 PM IST

చేపల పెంపకంపై వనపర్తి, గద్వాల జిల్లాలకు చెందిన మత్స్యకారులకు మెరైన్ ప్రాజెక్ట్స్​ ఎక్స్​పోర్ట్​ అథారిటీ (ఎమ్​పీఈడీఏ) ప్రత్యేక సెమినార్ నిర్వహించింది. మత్స్య సంపదను అభివృద్ధి చేసుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.

MPEDA organized a special seminar for fishermen on fish farming in Pebber, Vanaparthi district
చేపల పెంపకంపై ఎమ్​పీఈడీఏ ప్రత్యేక సెమినార్

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో చేపల పెంపకంపై వనపర్తి, గద్వాల జిల్లాల మత్స్యకారులకు ఎమ్​పీఈడీఏ ప్రత్యేక సెమినార్ నిర్వహించింది. చేపల కోసం చెరువులను తవ్వే విధానాన్ని రైతులకు వివరించింది. మత్స్య సంపదను అభివృద్ధి చేసుకునేందుకు రైతులు అవలంబించాల్సిన పద్ధతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎమ్​పీఈడీఏ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.

చేపల్లో త్వరగా అభివృద్ధి చెందే సీడ్స్​ని గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మత్స్యకారులకు సూచించారు. వనపర్తి జిల్లాలో చేపల పెంపకం బాగా పెరిగిందని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష తెలిపారు. గత ఏడాది 2 కోట్లకు పైగా చేపపిల్లలను జిల్లా పరిధిలోని చెరువులు కుంటల్లో వదిలినట్లు పేర్కొన్నారు.

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో చేపల పెంపకంపై వనపర్తి, గద్వాల జిల్లాల మత్స్యకారులకు ఎమ్​పీఈడీఏ ప్రత్యేక సెమినార్ నిర్వహించింది. చేపల కోసం చెరువులను తవ్వే విధానాన్ని రైతులకు వివరించింది. మత్స్య సంపదను అభివృద్ధి చేసుకునేందుకు రైతులు అవలంబించాల్సిన పద్ధతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎమ్​పీఈడీఏ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.

చేపల్లో త్వరగా అభివృద్ధి చెందే సీడ్స్​ని గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మత్స్యకారులకు సూచించారు. వనపర్తి జిల్లాలో చేపల పెంపకం బాగా పెరిగిందని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష తెలిపారు. గత ఏడాది 2 కోట్లకు పైగా చేపపిల్లలను జిల్లా పరిధిలోని చెరువులు కుంటల్లో వదిలినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.