ETV Bharat / state

'అధైర్య పడకండి... అండగా ఉంటాం' - Krishna river Maritime area

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి వారికి సరైన ఆశ్రయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

'అధైర్య పడకండి... అండగా ఉంటాం'
author img

By

Published : Aug 11, 2019, 7:07 PM IST

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. రెవెన్యూ అధికారులు, ఆర్డీవో, కలెక్టర్ నిత్యం నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారని ప్రజలకు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వరద వల్ల ఎలాంటి ముప్పు లేదని... ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల తేలు, పాములు వంటి విష ప్రాణులు గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రితో పాటు జిల్లా జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

'అధైర్య పడకండి... అండగా ఉంటాం'

ఇవీచూడండి: 'బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోం'

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. రెవెన్యూ అధికారులు, ఆర్డీవో, కలెక్టర్ నిత్యం నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారని ప్రజలకు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వరద వల్ల ఎలాంటి ముప్పు లేదని... ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల తేలు, పాములు వంటి విష ప్రాణులు గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రితో పాటు జిల్లా జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

'అధైర్య పడకండి... అండగా ఉంటాం'

ఇవీచూడండి: 'బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోం'

Intro:వనపర్తి జిల్లా ,పెబ్బేరు మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.


Body:వనపర్తి జిల్లా ,పెబ్బేరు మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. పెబ్బేరు మండలంలోని మునగ మాన్ దిన్నె, పెంచికలపాడు, రంగా పురం మరియు బీచుపల్లి పరివాహక ప్రాంతాలను పరిశీలన చేసిన పరిశీలన చేసిన మంత్రి. ఆయా ప్రాంతాలలోని ప్రజలతో మాట్లాడుతూ ఎలాంటి అధైర్యాన్ని గురికావద్దని, గంటగంటకు పరివాహక ప్రాంతంలోని నీటి మట్టం కొలతలు తెలుసు కుంటున్నాము అని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది లక్షల క్యూసెక్కుల ప్రవాహం పై నుండి వస్తుంది అని అంతే మొత్తంలో శ్రీశైలం ద్వారా నాగార్జునసాగర్ లోకి వదులుతున్నామని ,ప్రజలు ఎలాంటి కంగారు పడొద్దు అని తెలిపారు. రెవెన్యూ అధికారులు, ఆర్డిఓ, కలెక్టర్ గారు నిత్యం నదీ పరివాహక ప్రాంతాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని చేరవేస్తారు అని ప్రజలకు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వరద వల్ల ఎలాంటి ముప్పు లేదని కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరద వలన తేలు పాములు వంటి విష ప్రాణులు గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాత్రి సమయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా లైట్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతానికి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ వెదజల్లి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు .ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి వారికి సరైన ఆశ్రయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఆర్డిఓ ,పెబ్బేరు తహసిల్దార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.