ETV Bharat / state

సామాజిక దూరాన్ని పాటించాలి: మంత్రి నిరంజన్​రెడ్డి - రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి

కరోనా నియంత్రణ కోసం ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని వ్యవసాయ, మార్కెటింగ్​ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో కొవిడ్​-19 నివారణపై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు.

మంత్రి నిరంజన్​ రెడ్డి
మంత్రి నిరంజన్​ రెడ్డి
author img

By

Published : Mar 27, 2020, 6:19 AM IST

లాక్​డౌన్​ దృష్ట్యా వనపర్తి జిల్లాలో శుక్రవారం నుంచి 12 కేజీల బియ్యాన్ని, రూ. 1500లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్​ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి తెలిపారు. జిల్లాలో కొవిడ్​-19 నివారణపై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు పంటకోత, విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఇబ్బందులు కలిగించవద్దని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 53 మందికి ఇళ్లలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

లాక్​డౌన్ సమయంలో ధరలు పెంచితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఎంపీ, కలెక్టర్​తో కలిసి మంత్రి తనిఖీ చేశారు. కరోనా కట్టడికి జిల్లా అధికారులు చేస్తున్న చర్యలు అభినందనీయమన్నారు.

సామాజిక దూరాన్ని పాటించాలి : మంత్రి నిరంజన్​రెడ్డి

ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

లాక్​డౌన్​ దృష్ట్యా వనపర్తి జిల్లాలో శుక్రవారం నుంచి 12 కేజీల బియ్యాన్ని, రూ. 1500లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్​ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి తెలిపారు. జిల్లాలో కొవిడ్​-19 నివారణపై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు పంటకోత, విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఇబ్బందులు కలిగించవద్దని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 53 మందికి ఇళ్లలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

లాక్​డౌన్ సమయంలో ధరలు పెంచితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఎంపీ, కలెక్టర్​తో కలిసి మంత్రి తనిఖీ చేశారు. కరోనా కట్టడికి జిల్లా అధికారులు చేస్తున్న చర్యలు అభినందనీయమన్నారు.

సామాజిక దూరాన్ని పాటించాలి : మంత్రి నిరంజన్​రెడ్డి

ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.