ETV Bharat / state

పొలంలో మహిళ దారుణహత్య.. మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు - వికారాబాద్ నేర వార్తలు

వికారాబాద్ జిల్లా సోమన్​గుర్తి సమీపంలోని పొలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా దుండగులు నిప్పుపెట్టి తగులబెట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉండగా.. అసలు హత్యకు గల కారణాలేంటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The body of an unidentified woman was found on a farm at Soman Gurti in Vikarabad district
పొలంలో మహిళ దారుణహత్య.. మృతదేహాన్ని తగలబెట్టిన దుండగులు
author img

By

Published : Jul 27, 2020, 4:42 PM IST

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్​గుర్తి సమీపంలో దారుణం చోటుచేసుకుంది. నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న ఓ పొలంలో గుర్తు తెలియని మహిళ శవం (35) లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించకుండా దుండగులు నిప్పుపెట్టి తగులబెట్టారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మహిళపై కర్రతో దాడి చేసి, రాయితో మోది హత్యచేసి.. గుర్తించకుండా ఉండేందుకు తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు, రక్తపు మరకలతో ఉన్న కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య గురైన మహిళ ఎవరు, హత్యకు గల కారణాలేంటనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు.

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్​గుర్తి సమీపంలో దారుణం చోటుచేసుకుంది. నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న ఓ పొలంలో గుర్తు తెలియని మహిళ శవం (35) లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించకుండా దుండగులు నిప్పుపెట్టి తగులబెట్టారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మహిళపై కర్రతో దాడి చేసి, రాయితో మోది హత్యచేసి.. గుర్తించకుండా ఉండేందుకు తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు, రక్తపు మరకలతో ఉన్న కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య గురైన మహిళ ఎవరు, హత్యకు గల కారణాలేంటనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.