ETV Bharat / state

'మా కుమార్తెను అపహరించారు.. చర్యలు తీసుకోండి'

తమ కూతురిని మాయమాటలతో మోసగించిన యువకుడిని అరెస్ట్​ చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు ఆర్డీవోను ఆశ్రయించారు. ఈనెల 18న కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కూకట్​ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు తాండూర్ ఆర్డీవోను కలిసి విన్నవించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

author img

By

Published : Feb 20, 2021, 5:18 PM IST

Updated : Feb 24, 2021, 7:02 PM IST

parents complaint to tandoor rdo  her daughter kidnapped by a person in kukat village in yalala mandal vikarabad dist
తాండూర్​ ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తున్న బాలిక తల్లిదండ్రులు

మాయమాటలతో తమ కూమార్తెను తీసుకెళ్లిన యువకుడిని అరెస్ట్​ చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు ఆర్డీవోను ఆశ్రయించిన సంఘటన వికారాబాద్​ జిల్లా తాండూర్​లో జరిగింది. ఈనెల 18న కళాశాలకు వెళ్లిన తమ కూతురిని నరేశ్​ అనే యువకుడు తీసుకెళ్లాడంటూ తాండూర్​ ఆర్డీవో అశోక్​ కుమార్​కు ఫిర్యాదు చేశారు. యువకుడిని అరెస్ట్​ చేయకుండా ఎస్సై నిర్లక్ష్యం వహిస్తున్నాడని జిల్లాలోని యాలాల మండలం కూకట్​ గ్రామానికి చెందిన మొగులయ్య, అతని భార్య ఆరోపిస్తున్నారు. తక్షణమే యువకుడిని అరెస్ట్​ చేసి.. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్​ నాయకుడు మల్లయ్య డిమాండ్​ చేస్తున్నారు. లేని పక్షంలో డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. తమ కూతురిని అప్పగించి న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

బాలిక ఇటీవలే ఆత్మహత్యకు యత్నించింది :

గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వెంకటేషశ్​, నరేశ్​లు​ మాయమాటలు చెప్పి ఈ నెల మొదటి వారంలో అనంతగిరి కొండలకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. బాలికతో అసభ్యకరమైన చిత్రాలు దిగి.. వాటిని వాళ్ళ వాట్సాప్ స్టేటస్​ పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కోలుకున్నాక ఈ విషయాన్ని అప్పట్లోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు.

ఇదీ చూడండి : కోమరబండలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మాయమాటలతో తమ కూమార్తెను తీసుకెళ్లిన యువకుడిని అరెస్ట్​ చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు ఆర్డీవోను ఆశ్రయించిన సంఘటన వికారాబాద్​ జిల్లా తాండూర్​లో జరిగింది. ఈనెల 18న కళాశాలకు వెళ్లిన తమ కూతురిని నరేశ్​ అనే యువకుడు తీసుకెళ్లాడంటూ తాండూర్​ ఆర్డీవో అశోక్​ కుమార్​కు ఫిర్యాదు చేశారు. యువకుడిని అరెస్ట్​ చేయకుండా ఎస్సై నిర్లక్ష్యం వహిస్తున్నాడని జిల్లాలోని యాలాల మండలం కూకట్​ గ్రామానికి చెందిన మొగులయ్య, అతని భార్య ఆరోపిస్తున్నారు. తక్షణమే యువకుడిని అరెస్ట్​ చేసి.. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్​ నాయకుడు మల్లయ్య డిమాండ్​ చేస్తున్నారు. లేని పక్షంలో డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. తమ కూతురిని అప్పగించి న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

బాలిక ఇటీవలే ఆత్మహత్యకు యత్నించింది :

గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వెంకటేషశ్​, నరేశ్​లు​ మాయమాటలు చెప్పి ఈ నెల మొదటి వారంలో అనంతగిరి కొండలకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. బాలికతో అసభ్యకరమైన చిత్రాలు దిగి.. వాటిని వాళ్ళ వాట్సాప్ స్టేటస్​ పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కోలుకున్నాక ఈ విషయాన్ని అప్పట్లోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు.

ఇదీ చూడండి : కోమరబండలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Last Updated : Feb 24, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.