వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సొంత అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు భగ్గుమన్నాయి. రెండెకరాల పొలం కోసం సొంత సోదరులే ఒకరినొకరు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో తమ్ముడు యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు యాదయ్యను పోలీసు వాహనంలో పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి పంపించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: జిల్లాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా