రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం బెల్కటూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మహేందర్రెడ్డి పేర్కొన్నారు. దళారుల బెడద నుంచి రైతులను కాపాడుకోవటానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.
మరోవైపు తాండూర్ మండలంలోని మల్రెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాండూర్ పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఆమె సూచించారు.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు