రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ప్రారంభించారు. పలు కాలనీల్లో తిరిగి కాలనీవాసుల సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
నూతనంగా ఏర్పడిన పరిగి మున్సిపాలిటీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారిస్తామని... మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రజలకు భరోసానిచ్చారు.
ఇదీ చూడండి :'పల్లె ప్రగతి స్ఫూర్తితోనే పట్టణాల రూపురేఖలు మారుస్తాం'