ETV Bharat / state

'భాజపా నేతలు.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే చేస్తున్నరు' - minister niranjan reddy visit in vikarabad

వికారాబాద్ జిల్లాలోని మోమిన్​పేట, నారాయణపూర్, కెరెల్లిల్లో మంత్రి నిరంజన్​రెడ్డి పర్యటింటారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ... భాజపా నేతలపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

minister niranjan reddy fire on bjp leaders in kerelli
minister niranjan reddy fire on bjp leaders in kerelli
author img

By

Published : Dec 6, 2020, 7:17 PM IST

'భాజపా నేతలు.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే చేస్తున్నారు'

జీహెచ్​ఎంసీ ఫలితాలతో భాజపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లాలోని మోమిన్​పేట, నారాయణపూర్, కెరెల్లిల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. కెరెల్లిలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక అసలు ఎన్నికే కాదన్నారు. వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దన్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా భాజపా నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

హైద్రాబాద్​లో వచ్చిన ఫలితాలే ప్రామాణికమైతే... 2015లో దిల్లీలో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు 3 సీట్లకే పరిమితమైన భాజపా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతు ఏడ్చిన రాజ్యంలో ఎవ్వరూ బాగుపడినట్లు చరిత్రలో లేదని హెచ్చరించారు. ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్​లో తెరాస పాల్గొంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకండా జాతీయ రహదారులు నిర్భందిస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​ బంద్​కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు

'భాజపా నేతలు.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే చేస్తున్నారు'

జీహెచ్​ఎంసీ ఫలితాలతో భాజపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లాలోని మోమిన్​పేట, నారాయణపూర్, కెరెల్లిల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. కెరెల్లిలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక అసలు ఎన్నికే కాదన్నారు. వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దన్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా భాజపా నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

హైద్రాబాద్​లో వచ్చిన ఫలితాలే ప్రామాణికమైతే... 2015లో దిల్లీలో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు 3 సీట్లకే పరిమితమైన భాజపా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతు ఏడ్చిన రాజ్యంలో ఎవ్వరూ బాగుపడినట్లు చరిత్రలో లేదని హెచ్చరించారు. ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్​లో తెరాస పాల్గొంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకండా జాతీయ రహదారులు నిర్భందిస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​ బంద్​కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.