ETV Bharat / state

'భూదాన్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి' - hyderabad updates

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలో అన్యాక్రాంతమైన భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నేతలు కోరారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్​కు ఫిర్యాదు చేశారు.

CPM leaders demand acquisition of alienated Bhutanese lands in Vikarabad district
'భూదాన్ భూములు ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి'
author img

By

Published : Feb 25, 2021, 10:29 AM IST

అన్యాక్రాంతమైన భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్​కు సీపీఎం నేతలు విజ్ఞప్తి చేశారు. పరిగి మండలం నారాయణపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో మొత్తం 32.22 ఎకరాల భూదాన్ భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

32 ఎకరాల భూదాన్ భూమిలో 9 ఎకరాల 15 గుంటలు సుగుణ స్టీల్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య ఆరోపించారు. మిగతా భూమిని హైదరాబాద్​కు చెందిన బగ్గా వైన్స్ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

అన్యాక్రాంతమైన భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్​కు సీపీఎం నేతలు విజ్ఞప్తి చేశారు. పరిగి మండలం నారాయణపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో మొత్తం 32.22 ఎకరాల భూదాన్ భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

32 ఎకరాల భూదాన్ భూమిలో 9 ఎకరాల 15 గుంటలు సుగుణ స్టీల్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య ఆరోపించారు. మిగతా భూమిని హైదరాబాద్​కు చెందిన బగ్గా వైన్స్ యాజమాన్యం ఆక్రమించుకున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:కోహ్లీ కోసం బయోబబుల్​ నిబంధనలు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.