పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. హుజూర్నగర్లో కొత్తగా నిర్మిస్తున్న ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఎన్ఎస్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
డ్రైనేజీ డంపింగ్ యార్డ్ కోసం స్థల సేకరణ పూర్తయిందని కలెక్టర్ వినయ్ తెలిపారు. పారిశుద్ధ్యంలో కార్మికుల కొరత లేకుండా చూస్తామన్నారు. ఎప్పటికప్పుడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మళ్లీ నాలుగో తేదీన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య