ETV Bharat / state

ఎన్నికలు రాగానే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రత్యక్షం: ఉత్తమ్​

author img

By

Published : Mar 3, 2021, 10:38 PM IST

ఓట్ల సమయంలోనే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రత్యక్షమవుతారని పీసీసీ చీఫ్ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెరాస నాయకులు భూకబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​లోని ఇందిరాభవన్​లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

pcc chief uttam kumar reddy participated in mlc election campaign in huzurnagar in suryapet district
ఎన్నికలు రాగానే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రత్యక్షం: ఉత్తమ్​

తెరాస నాయకులు సాండ్​, ల్యాండ్​, మైన్స్​, వైన్స్​ మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతారని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి కేవలం ఓట్ల సమయంలోనే దర్శనమిస్తారని ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​లోని ఇందిరాభవన్​లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు కేరాఫ్​గా తెరాస నాయకులు నిలిచారని ఆరోపించారు.

ఎన్నికలు రాగానే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రత్యక్షం: ఉత్తమ్​

మంథనిలో న్యాయవాద దంపతులను అతి కిరాతకంగా నరికి చంపడం తెరాస పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం మొదలైందని పేర్కొన్నారు. తెరాస ఎమ్మెల్సీ ఏనాడు శాసనమండలిలో నోరు మెదపలేదని విమర్శించారు. రాములు నాయక్​ అధికార పార్టీ నుంచి కాంగ్రెస్​లో చేరారని.. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉత్తమ్​ కోరారు. గిరిజనులకు సీఎం తీవ్ర అన్యాయం చేశారని ఉత్తమ్​ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: మూడు నెలల్లో లక్షా 91 వేల ఉద్యోగాలకు కృషి చేస్తాం: చిన్నారెడ్డి

తెరాస నాయకులు సాండ్​, ల్యాండ్​, మైన్స్​, వైన్స్​ మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతారని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి కేవలం ఓట్ల సమయంలోనే దర్శనమిస్తారని ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​లోని ఇందిరాభవన్​లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు కేరాఫ్​గా తెరాస నాయకులు నిలిచారని ఆరోపించారు.

ఎన్నికలు రాగానే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రత్యక్షం: ఉత్తమ్​

మంథనిలో న్యాయవాద దంపతులను అతి కిరాతకంగా నరికి చంపడం తెరాస పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం మొదలైందని పేర్కొన్నారు. తెరాస ఎమ్మెల్సీ ఏనాడు శాసనమండలిలో నోరు మెదపలేదని విమర్శించారు. రాములు నాయక్​ అధికార పార్టీ నుంచి కాంగ్రెస్​లో చేరారని.. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉత్తమ్​ కోరారు. గిరిజనులకు సీఎం తీవ్ర అన్యాయం చేశారని ఉత్తమ్​ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: మూడు నెలల్లో లక్షా 91 వేల ఉద్యోగాలకు కృషి చేస్తాం: చిన్నారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.