ETV Bharat / state

కారు బోల్తా... స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు - కారు బోల్తా... స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

సూర్యాపేట జిల్లా మద్దిరాల పోలీసు స్టేషన్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపర్తి మండల వాసులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

overturned a car and four members injured at maddirala suryapet district
కారు బోల్తా... స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
author img

By

Published : Aug 14, 2020, 7:03 AM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పోలీసు స్టేషన్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా... అందులోని నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్ రూరల్​ జిల్లా రాయపర్తి మండల్ బురాంపురం గ్రామానికి చెందిన చిలువేరు శాంతకుమార్, జంపాల ప్రవీణ్ కపిల్, సాయి కుమార్, తాటికొండ కపిల్​గా పోలీసులు గుర్తించారు. నిమ్మకల్ దండు మైసమ్మ టెంపుల్ వద్ద ఓ వివాహావేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. హైవే 365 నుంచి వరంగల్ రోడ్డుకు దిగే క్రమంలో షిఫ్ట్​ డిజైర్ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పోలీసు స్టేషన్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా... అందులోని నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్ రూరల్​ జిల్లా రాయపర్తి మండల్ బురాంపురం గ్రామానికి చెందిన చిలువేరు శాంతకుమార్, జంపాల ప్రవీణ్ కపిల్, సాయి కుమార్, తాటికొండ కపిల్​గా పోలీసులు గుర్తించారు. నిమ్మకల్ దండు మైసమ్మ టెంపుల్ వద్ద ఓ వివాహావేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. హైవే 365 నుంచి వరంగల్ రోడ్డుకు దిగే క్రమంలో షిఫ్ట్​ డిజైర్ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: అటవీశాఖ అధికారుల వాహనాన్ని వెంబడించిన గజరాజు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.