ETV Bharat / state

వాగులో ఆడుకుంటూ తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు

author img

By

Published : Oct 22, 2020, 6:54 AM IST

సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఓ బాలుడు వరద నీటికి వాగులో గల్లంతయ్యాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Nine boy stuck  in flood water in suryapeta district
వాగులో ఆడుకుంటూ తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన తొమ్మిదేళ్ల బాలుడు వాగులో గల్లంతయ్యాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాలుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొర్నె ప్రవీణ్​ చిన్న కుమారుడు వరుణ్ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి బిక్కేరు వాగులో ఆడుకోవడానికి వెళ్లాడు. ఆకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడంతో వరుణ్ గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై డానియేల్ కుమార్ సమక్షంలో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:వరద నుంచి కోలుకోని లోతట్టు కాలనీలు... ఆందోళనలో స్థానికులు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన తొమ్మిదేళ్ల బాలుడు వాగులో గల్లంతయ్యాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాలుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొర్నె ప్రవీణ్​ చిన్న కుమారుడు వరుణ్ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి బిక్కేరు వాగులో ఆడుకోవడానికి వెళ్లాడు. ఆకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడంతో వరుణ్ గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై డానియేల్ కుమార్ సమక్షంలో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:వరద నుంచి కోలుకోని లోతట్టు కాలనీలు... ఆందోళనలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.