ETV Bharat / state

'విషాద' పట్నం.. మనమెంత భద్రం?

అర్ధరాత్రి అనుకోని ఉపద్రవం ఉత్తరాంధ్రను కుదిపేసింది. ప్రపంచాన్ని కాపాడే ప్రాణాధారమే పంచపాణాల్ని తీసేసింది. కాలుష్యం చేసిన గాయాన్ని కరోనా కూడా మాయం చేయలేకపోయింది. ఉక్కులాంటి విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేసింది. దీన్నుంచి మనమేం నేర్చుకోవాలి? కార్మికులు ఒళ్లంతా కళ్లు చేసుకుని పనిచేయాలి.. సాంకేతిక నిపుణులు ప్రమాణాలను పాటించాలి.. అధికారులు నిరంతరం నిబంధనల్ని లెక్కగట్టాలి ప్రభుత్వాల నిత్య పర్యవేక్షణే శ్రీరామరక్ష!

author img

By

Published : May 8, 2020, 11:19 AM IST

nalgonda district labor afraid of vizag gas leak incident
విషాద పట్నం.. మనమెంత భద్రం?

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా కంపెనీలో స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ జరగడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చనీయాంశమైంది. నల్గొండ, యాదాద్రి జిల్లాలు రాజధానికి ఆనుకొని ఉండటంతో పాటు ఫార్మా, టెక్స్‌టైల్స్‌, మ్యానుఫాక్చరింగ్‌ పరిశ్రమలు ఇక్కడే ఉండటంతో వాటిల్లో పనిచేసే కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

విశాఖపట్నంలో లీకైన తరహా గ్యాస్‌ను వాడే పరిశ్రమలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేవని అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్కువ ముప్ఫు. ఔషధ పరిశ్రమలు విడుదలచేసే వ్యర్థాల నుంచేనని వారు గుర్తు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ తయారీ తొలిదశలో ముడి సరకును తయారు చేసేందుకు స్టైరీన్‌ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. జిల్లాలో ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలున్నా అవి ముడి సరకుతో ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్‌ను తయారు చేసేవే. వీటిలో ఎక్కడా స్టైరీన్‌ గ్యాస్‌ను వాడటం లేదు.

నిబంధనల బేఖాతర్‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీబీనగర్‌, పోచంపల్లి, భువనగిరి, బొమ్మలరామారం, చౌటుప్పల్‌, చిట్యాల తదితర మండలాల్లో దాదాపు 100 పెద్ద, మరో 200 చిన్నాచితక ఔషధ పరిశ్రమలున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఈ తరహా పరిశ్రమల్లో దాదాపు 40 శాతానికి పైగా ఇక్కడే కొలువుదీరాయి. ఫలితంగా బీబీనగర్‌, పోచంపల్లి, చౌటుప్పల్‌, చిట్యాల మండలాల్లోని కొన్ని పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ఇక్కడి ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్నారు.

రాత్రి అయితే చౌటుప్పల్‌ పరిసరాల్లోని కొన్ని పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువుల (కంపు)తో అక్కడ నివసించలేని పరిస్థితి. మరోవైపు ఇక్కడి ఔషధ పరిశ్రమల్లో కొన్ని ప్రభుత్వ సూచనలు పాటించి పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్నా మరికొన్ని ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారం ఉండటంతో స్థానికులు ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

స్టైరీన్‌ గ్యాస్‌ వాడే పరిశ్రమలు లేవు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్టైరీన్‌ గ్యాస్‌ వాడే పరిశ్రమలు లేవు. దీనిని ప్లాస్టిక్‌ తయారీ తొలి దశలో వాడే ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఉమ్మడి నల్గొండలో పాలిమర్స్‌ పరిశ్రమలున్నా ఎందులోనూ ఈ తరహా గ్యాస్‌ను వాడరు. ఔషధ పరిశ్రమల్లో వాడే వాటికి ఈ గ్యాస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆయా పరిశ్రమలు నిబంధనలను పాటించడంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం.

- రాజేందర్‌, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), ఉమ్మడి నల్గొండ జిల్లా

దీర్ఘకాలికంగా ఇబ్బందే

ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువుల (కంపు) వల్ల స్థానిక ప్రజలకు శ్వాసకోస వ్యాధులు వస్తాయి. ఇవి దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి చర్మంపై దద్దుర్లు, చర్మం కందిపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. పరిశ్రమలు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చేస్తే ప్రజలను వీటి నుంచి కాపాడినవారమవుతాము.

- డా. అనితారాణి, డా.జయకుమార్‌, చర్మ సంబంధ వ్యాధుల నిపుణులు, నల్గొండ

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా కంపెనీలో స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ జరగడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చనీయాంశమైంది. నల్గొండ, యాదాద్రి జిల్లాలు రాజధానికి ఆనుకొని ఉండటంతో పాటు ఫార్మా, టెక్స్‌టైల్స్‌, మ్యానుఫాక్చరింగ్‌ పరిశ్రమలు ఇక్కడే ఉండటంతో వాటిల్లో పనిచేసే కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

విశాఖపట్నంలో లీకైన తరహా గ్యాస్‌ను వాడే పరిశ్రమలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేవని అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్కువ ముప్ఫు. ఔషధ పరిశ్రమలు విడుదలచేసే వ్యర్థాల నుంచేనని వారు గుర్తు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ తయారీ తొలిదశలో ముడి సరకును తయారు చేసేందుకు స్టైరీన్‌ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. జిల్లాలో ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలున్నా అవి ముడి సరకుతో ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్‌ను తయారు చేసేవే. వీటిలో ఎక్కడా స్టైరీన్‌ గ్యాస్‌ను వాడటం లేదు.

నిబంధనల బేఖాతర్‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీబీనగర్‌, పోచంపల్లి, భువనగిరి, బొమ్మలరామారం, చౌటుప్పల్‌, చిట్యాల తదితర మండలాల్లో దాదాపు 100 పెద్ద, మరో 200 చిన్నాచితక ఔషధ పరిశ్రమలున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఈ తరహా పరిశ్రమల్లో దాదాపు 40 శాతానికి పైగా ఇక్కడే కొలువుదీరాయి. ఫలితంగా బీబీనగర్‌, పోచంపల్లి, చౌటుప్పల్‌, చిట్యాల మండలాల్లోని కొన్ని పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ఇక్కడి ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్నారు.

రాత్రి అయితే చౌటుప్పల్‌ పరిసరాల్లోని కొన్ని పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువుల (కంపు)తో అక్కడ నివసించలేని పరిస్థితి. మరోవైపు ఇక్కడి ఔషధ పరిశ్రమల్లో కొన్ని ప్రభుత్వ సూచనలు పాటించి పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్నా మరికొన్ని ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారం ఉండటంతో స్థానికులు ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

స్టైరీన్‌ గ్యాస్‌ వాడే పరిశ్రమలు లేవు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్టైరీన్‌ గ్యాస్‌ వాడే పరిశ్రమలు లేవు. దీనిని ప్లాస్టిక్‌ తయారీ తొలి దశలో వాడే ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఉమ్మడి నల్గొండలో పాలిమర్స్‌ పరిశ్రమలున్నా ఎందులోనూ ఈ తరహా గ్యాస్‌ను వాడరు. ఔషధ పరిశ్రమల్లో వాడే వాటికి ఈ గ్యాస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆయా పరిశ్రమలు నిబంధనలను పాటించడంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం.

- రాజేందర్‌, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), ఉమ్మడి నల్గొండ జిల్లా

దీర్ఘకాలికంగా ఇబ్బందే

ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువుల (కంపు) వల్ల స్థానిక ప్రజలకు శ్వాసకోస వ్యాధులు వస్తాయి. ఇవి దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి చర్మంపై దద్దుర్లు, చర్మం కందిపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. పరిశ్రమలు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చేస్తే ప్రజలను వీటి నుంచి కాపాడినవారమవుతాము.

- డా. అనితారాణి, డా.జయకుమార్‌, చర్మ సంబంధ వ్యాధుల నిపుణులు, నల్గొండ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.