ETV Bharat / state

'సన్నాలకు బోనస్​తో కలిపి రూ.2500 మద్దతు ధర ప్రకటించాలి' - మునగాల సర్వసభ్యసమావేశానికి హాజరైన ఉత్తమ్​

సూర్యాపేట జిల్లా మునగాల మండల సర్వసభ్య సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'సన్నాలకు బోనస్​తో కలిపి రూ.2500 మద్దతు ధర ప్రకటించాలి'
'సన్నాలకు బోనస్​తో కలిపి రూ.2500 మద్దతు ధర ప్రకటించాలి'
author img

By

Published : Nov 13, 2020, 3:24 PM IST

రాష్ట్రంలో సన్నారకం వడ్లకు క్వింటాకు బోనస్​తో కలిపి రూ.2500 ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి డిమాండ్ చేశారు. పత్తి పంటకు రూ.5800 ధర ప్రకటించాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల సర్వసభ్య సమావేశానికి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. మండలంలోని పలు సమస్యలపై సమావేశం సాఫీగా సాగింది. మిషన్ మిషన్ భగీరథ కారణంగా రోడ్లు ధ్వంసం, అకాల వర్షానికి వరి పంట నష్టం, చెరువుల మరమ్మతులకు సంబంధించిన సమస్యలను సమావేశంలో చర్చించారు.

వెంటనే ఐకేపీ కేంద్రాలను ఏర్పాటుచేసి సన్నాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ఉత్తమ్​ సూచించారు. ఏకకాలంలో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య తెలిపారు. మునగాల మండలానికి ప్రత్యేక నిధులతో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం మునగాల మండలం సమస్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి: టపాసుల నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

రాష్ట్రంలో సన్నారకం వడ్లకు క్వింటాకు బోనస్​తో కలిపి రూ.2500 ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి డిమాండ్ చేశారు. పత్తి పంటకు రూ.5800 ధర ప్రకటించాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల సర్వసభ్య సమావేశానికి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. మండలంలోని పలు సమస్యలపై సమావేశం సాఫీగా సాగింది. మిషన్ మిషన్ భగీరథ కారణంగా రోడ్లు ధ్వంసం, అకాల వర్షానికి వరి పంట నష్టం, చెరువుల మరమ్మతులకు సంబంధించిన సమస్యలను సమావేశంలో చర్చించారు.

వెంటనే ఐకేపీ కేంద్రాలను ఏర్పాటుచేసి సన్నాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ఉత్తమ్​ సూచించారు. ఏకకాలంలో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య తెలిపారు. మునగాల మండలానికి ప్రత్యేక నిధులతో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం మునగాల మండలం సమస్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి: టపాసుల నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.