సూర్యాపేట జిల్లా కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా బాలల వారోత్సవాలు ముగిశాయి. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. వివిధ వేషధారణలో వచ్చిన చిన్నారులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 'కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి' అనే నినాదం ఇచ్చిన అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీల బదిలీ