ETV Bharat / state

పీసీసీ చీఫ్​ ఉత్తమ్​తో జైపాల్​రెడ్డి అనుబంధం - హుజూర్​నగర్​ నియోజకవర్గంతో జైపాల్​రెడ్డి అనుబంధం

దివంగత్​ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డి ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ... కష్టసుఖాలను పంచుకునే వారు. మిర్యాలగూడ ఎంపీగా ఉన్న సమయంలో ఉత్తమ్​కుమార్​రెడ్డితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారు. హుజూర్​నగర్​ నియోజకవర్గం, ఉత్తమ్​తో జైపాల్​రెడ్డికున్న అనుబంధాన్ని నాయకులు గుర్తుచేసుకుంటున్నారు.

Jaipal Reddy is an affiliate of Huzoor Nagar constituency
author img

By

Published : Jul 28, 2019, 7:49 PM IST

కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డికి హుజూర్​నగర్​ నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధం ఉంది. జైపాల్​రెడ్డి మిర్యాలగూడ ఎంపీగా ఉన్న సమయంలో కోదాడ, హుజూర్​నగర్​లో ఉత్తమ్​తో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ఉత్తమ్​కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో జైపాల్​రెడ్డి పాల్గొన్నారు. గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో, సమ భావన గ్రూపు సభ్యులకు దీపం పథకం అమలు చేశారు. జలయజ్ఞం కార్యక్రమంలో, శాంతినగర్ ఎత్తిపోతల పథకం కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు హాజరయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవన సముదాయానికి ఆనాటి గవర్నర్ ఎన్.డి.తివారీతో కలిసి నడిగూడెంలో శంకుస్థాపన చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు.

హుజూర్​నగర్​ నియోజకవర్గంతో జైపాల్​రెడ్డి అనుబంధం

ఇవీ చూడండి: జైపాల్​రెడ్డి: ఉస్మానియా టు పార్లమెంట్​

కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డికి హుజూర్​నగర్​ నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధం ఉంది. జైపాల్​రెడ్డి మిర్యాలగూడ ఎంపీగా ఉన్న సమయంలో కోదాడ, హుజూర్​నగర్​లో ఉత్తమ్​తో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ఉత్తమ్​కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో జైపాల్​రెడ్డి పాల్గొన్నారు. గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో, సమ భావన గ్రూపు సభ్యులకు దీపం పథకం అమలు చేశారు. జలయజ్ఞం కార్యక్రమంలో, శాంతినగర్ ఎత్తిపోతల పథకం కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు హాజరయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవన సముదాయానికి ఆనాటి గవర్నర్ ఎన్.డి.తివారీతో కలిసి నడిగూడెంలో శంకుస్థాపన చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు.

హుజూర్​నగర్​ నియోజకవర్గంతో జైపాల్​రెడ్డి అనుబంధం

ఇవీ చూడండి: జైపాల్​రెడ్డి: ఉస్మానియా టు పార్లమెంట్​

TG_NLG_61_27_BIBINAGARLO_CHORI_AV_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో నిన్న రాత్రి దొంగలు పలు ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. స్థానిక శివశక్తి వైన్స్ తాళాలు పగలగొట్టి సుమారు 16 వేళా నగదు, కొన్ని మద్యం బాటిల్స్ ఎత్తుకుపోయారు. ఆ పక్కనే ఉన్న బీబీనగర్ జెడ్పిటిసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి ఇంట్లో ఇంటి తాళం పగలగొట్టి 15 తులాల బంగారం,కిలో వెండి దుండగులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని గోకుల్ నగర్ నివాసి తోకలి రమేష్ ఇంట్లో నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లారు. ఘటన స్థలాన్ని జిల్లా డీజీపీ నారాయణరెడ్డి సందర్శించారు. స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.