ETV Bharat / state

భారీ వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు

సూర్యాపేట జిల్లా పాలకవీడు, నేరేడుచర్ల మండలాల్లో గత రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

author img

By

Published : Sep 12, 2020, 3:36 PM IST

heavy rain in suryapeta district
భారీ వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు, నేరేడుచర్ల మండలాల్లో గత రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేరేడుచర్ల మండలంలో ఈ వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది దాదాపుగా 30 నుంచి 40 ఎకరాల పంట నీట మునిగింది.

పాలకవీడు, నేరేడుచర్ల మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించటం వల్ల రెండు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎప్పుడో బ్రిటిష్​ కాలం నాటి వంతెనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. చిన్న వర్షానికి వంతెన పైనుంచి నీరు వెళ్తుందని.. ఇప్పంటికైనా అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు, నేరేడుచర్ల మండలాల్లో గత రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేరేడుచర్ల మండలంలో ఈ వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది దాదాపుగా 30 నుంచి 40 ఎకరాల పంట నీట మునిగింది.

పాలకవీడు, నేరేడుచర్ల మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించటం వల్ల రెండు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎప్పుడో బ్రిటిష్​ కాలం నాటి వంతెనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. చిన్న వర్షానికి వంతెన పైనుంచి నీరు వెళ్తుందని.. ఇప్పంటికైనా అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ప్రాణాలకు తెగించి.. గర్భిణికి చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.