ETV Bharat / state

తిరుమలగిరిలో రైతుల ధర్నా... స్తంభించిన ట్రాఫిక్

author img

By

Published : Nov 25, 2020, 5:40 PM IST

పత్తి కొనుగోళ్లను మూడు రోజుల పాటు నిలిపివేయడంతో తిరుమలగిరిలో రైతులు ధర్నాకి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా కొనుగోళ్లు నిలిపివేయడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. తిరుమలగిరి - మోత్కూరు రోడ్డుపై గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది.

farmers protest at tirumalagiri in suryapet
తిరుమలగిరిలో రైతుల ధర్నా... స్తంభించిన ట్రాఫిక్

ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూడు రోజుల పాటు పత్తి కొనుగోళ్లను నిలిపివేయడం ఎంతవరకు న్యాయమంటూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిపి వేయడంతో ఆగ్రహించిన అన్నదాతలు తిరుమలగిరి - మోత్కూరు రోడ్డుపై గంటపాటు ధర్నా నిర్వహించారు.

రోడ్డుపై కిలోమీటరు మేర వాహనాలు నిలచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మార్కెట్ కార్యదర్శి శంశేర్ వచ్చి... కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ విషయమై పత్తి కొనుగోలు అధికారులను వివరణ కోరగా... ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కారణంగా మిల్లులో స్థలం లేకపోవడంతో నిలిపివేసినట్లు తెలిపారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూడు రోజుల పాటు పత్తి కొనుగోళ్లను నిలిపివేయడం ఎంతవరకు న్యాయమంటూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిపి వేయడంతో ఆగ్రహించిన అన్నదాతలు తిరుమలగిరి - మోత్కూరు రోడ్డుపై గంటపాటు ధర్నా నిర్వహించారు.

రోడ్డుపై కిలోమీటరు మేర వాహనాలు నిలచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మార్కెట్ కార్యదర్శి శంశేర్ వచ్చి... కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ విషయమై పత్తి కొనుగోలు అధికారులను వివరణ కోరగా... ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కారణంగా మిల్లులో స్థలం లేకపోవడంతో నిలిపివేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: మళ్లీ లాక్​డౌన్​పై రాష్ట్రాలకు కేంద్రం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.