ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూడు రోజుల పాటు పత్తి కొనుగోళ్లను నిలిపివేయడం ఎంతవరకు న్యాయమంటూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిపి వేయడంతో ఆగ్రహించిన అన్నదాతలు తిరుమలగిరి - మోత్కూరు రోడ్డుపై గంటపాటు ధర్నా నిర్వహించారు.
రోడ్డుపై కిలోమీటరు మేర వాహనాలు నిలచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మార్కెట్ కార్యదర్శి శంశేర్ వచ్చి... కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ విషయమై పత్తి కొనుగోలు అధికారులను వివరణ కోరగా... ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కారణంగా మిల్లులో స్థలం లేకపోవడంతో నిలిపివేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: మళ్లీ లాక్డౌన్పై రాష్ట్రాలకు కేంద్రం క్లారిటీ