సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలలో సిలిండర్ లీక్ అయింది. ఉలిక్కిపడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.
వారు ఘటనా స్థలికి చేరుకునేలోపే ఉపాధ్యాయులు... తడి గోనె సంచులను సిలిండర్పై వేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మార్వో ఆంజనేయులు ఘటనపై ఆరా తీశారు.
ఇదీ చూడండి: మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్