ETV Bharat / state

హుజూర్​నగర్​లో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

author img

By

Published : Aug 30, 2020, 1:54 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. బోనం సమర్పించడానికి వచ్చే భక్తులు కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

bonalu festival celebrations at huzurnagar in suryapeta district
హుజూర్​నగర్​లో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున నుంచి మూడురోజులు కొనసాగే ఈజాతరలో భాగంగా నేడు మొదటి రోజున అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు అలంకరించారు. దూపదీప నైవేధ్యాలను సమర్పించారు.

ముత్యాలమ్మ తల్లి ప్రజలందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తులు కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తులు తీసుకోవాలని.. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కార్య నిర్వహణ కమిటీ తెలిపింది.

ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున నుంచి మూడురోజులు కొనసాగే ఈజాతరలో భాగంగా నేడు మొదటి రోజున అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు అలంకరించారు. దూపదీప నైవేధ్యాలను సమర్పించారు.

ముత్యాలమ్మ తల్లి ప్రజలందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తులు కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తులు తీసుకోవాలని.. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కార్య నిర్వహణ కమిటీ తెలిపింది.

ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.