ETV Bharat / state

చౌదర్​పల్లిలో మంత్రి హరీశ్​రావు పర్యటన

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్​పల్లిలోని దుబ్బరాజేశ్వరస్వామి ఆలయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

author img

By

Published : Nov 1, 2019, 3:36 PM IST

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు సిద్దిపేట పర్యటన
ఆర్థిక మంత్రి హరీశ్​ రావు సిద్దిపేట పర్యటన

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా చౌదర్​పల్లిలోని దుబ్బరాజేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌదర్​పల్లిలో భవన నిర్మాణ రంగ కార్మికుల భవనం, కుమ్మర సంఘం భవనాలకు శంకుస్థాపన చేశారు. యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం ప్రాధమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలవుతుందా లేదా అని తెలుసుకున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో ఆరా తీశారు.

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు సిద్దిపేట పర్యటన

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా చౌదర్​పల్లిలోని దుబ్బరాజేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌదర్​పల్లిలో భవన నిర్మాణ రంగ కార్మికుల భవనం, కుమ్మర సంఘం భవనాలకు శంకుస్థాపన చేశారు. యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం ప్రాధమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలవుతుందా లేదా అని తెలుసుకున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో ఆరా తీశారు.

Intro:దుబ్బాక మండలం లోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.




Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్ పల్లి గ్రామం లోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సందర్శించి పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు వారికి కలశంతో స్వాగతం పలికారు.

అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి తో కలిసి చౌదర్పల్లి గ్రామంలోని భవన నిర్మాణ రంగ కార్మికుల భవనాన్ని ప్రారంభించి(5 లక్షలు),కుమ్మర సంఘం భవనానికి(5 లక్షలు) శంకుస్థాపన చేశారు, మరియు యాదవ సంఘం భవనాన్ని(10 లక్షలు) ప్రారంభించారు.

గ్రామం లోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం సరిగా పెడుతున్నారా లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి సెంటర్ వద్ద ఆగి, ప్రతిరోజు చిన్న పిల్లలకు భోజనం లో పెట్టే కోడిగుడ్డు పరిశీలించారు అలాగే పిల్లలకు వండి పెట్టే బియ్యం నాణ్యతను పరిశీలించారు.

అనంతరం వీధిలోని మహిళలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆసరా పింఛన్లు అందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.





Conclusion:దుబ్బాక మండలం చౌదర్ పల్లి గ్రామంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరియు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దుబ్బ రాజేశ్వర ఆలయాన్ని సందర్శించిన అనంతరం.

గ్రామం లోని భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం భవనాన్ని ప్రారంభించి, అలాగే కుమ్మర సంఘం భవనానికి శంకుస్థాపన చేసి, యాదవ సంగం భవనాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక జడ్పిటిసి, ఎంపీపీ, టిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.