ETV Bharat / state

'రెండురోజుల్లో అట్రాసిటీ పరిహారం అందించాలి'

author img

By

Published : Aug 30, 2020, 1:26 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరానికి చెందిన బాలిక అట్రాసిటీ కేసు పరిహారంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆరా తీసింది. పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని తెలిసి రెండు రోజుల్లో బాధితురాలకి డబ్బు అందించాలని ఆదేశించింది.

Siddipet Jagdevpur Delay in compensation of atrocity case victim
'రెండురోజుల్లో అట్రాసిటీ పరిహారం అందించాలి'

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై గతంలో అట్రాసిటీ కేసు నమోదయింది. బాధితురాలికి అందాల్సిన పరిహారంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం ఆరా తీశారు. బాధితురాలని పరామర్శించినట్టు ఆయన తెలిపారు. ఆమెకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని గుర్తించిన ఆయన పూర్తి పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అట్రాసిటీ పరిహారం చెల్లింపు జాప్యంలో అధికారులపై ఆయన మండిపడ్డారు. ఇకమీదట పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన బాధితులకు సొమ్మును అందజేయాలని ఆయన అధికారులకు సూచించినట్లుగా తెలిపారు.

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై గతంలో అట్రాసిటీ కేసు నమోదయింది. బాధితురాలికి అందాల్సిన పరిహారంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం ఆరా తీశారు. బాధితురాలని పరామర్శించినట్టు ఆయన తెలిపారు. ఆమెకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని గుర్తించిన ఆయన పూర్తి పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అట్రాసిటీ పరిహారం చెల్లింపు జాప్యంలో అధికారులపై ఆయన మండిపడ్డారు. ఇకమీదట పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన బాధితులకు సొమ్మును అందజేయాలని ఆయన అధికారులకు సూచించినట్లుగా తెలిపారు.

ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.