ETV Bharat / state

సామాజిక దూరం పాటించని ప్రజలు - సిద్దిపేట జిల్లా ఈరోజు వార్తలు

హుస్నాబాద్​లో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల కోసం రేషన్ దుకాణాల ఎదుట లబ్ధిదారులు బారులు తీరారు. కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటించకుండా గుమిగుడారు. గుంపులుగా రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకుంటున్నారు.

People who do not practice social distance siddipet
సామాజిక దూరం పాటించని ప్రజలు
author img

By

Published : Apr 4, 2020, 4:31 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో రేషన్​ దుకాణాల వద్దకు లబ్ధిదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటించకుండా గుమిగుడారు. కొన్ని చోట్ల ఒకరినొకరు తోసుకున్నారు. దాదాపు హుస్నాబాద్​లో ఎనిమిది రేషన్ దుకాణాలు ఉన్నాయి.

ఒక్కొ దుకాణంలో 100 మంది లబ్ధిదారులకు కూపన్లు ఇచ్చారు. ఓ వైపు పలు చోట్లు యంత్రాలు మొరయిస్తుండగా.. మరో వైపు నిబంధనలు పాటించకుండా లబ్ధిదారులు గుంపులుగా చేరుతున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించి లబ్ధిదారులు గుంపులుగా రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో రేషన్​ దుకాణాల వద్దకు లబ్ధిదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటించకుండా గుమిగుడారు. కొన్ని చోట్ల ఒకరినొకరు తోసుకున్నారు. దాదాపు హుస్నాబాద్​లో ఎనిమిది రేషన్ దుకాణాలు ఉన్నాయి.

ఒక్కొ దుకాణంలో 100 మంది లబ్ధిదారులకు కూపన్లు ఇచ్చారు. ఓ వైపు పలు చోట్లు యంత్రాలు మొరయిస్తుండగా.. మరో వైపు నిబంధనలు పాటించకుండా లబ్ధిదారులు గుంపులుగా చేరుతున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించి లబ్ధిదారులు గుంపులుగా రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చూడండి : తొలి కరోనా కేసుతో అధికారులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.