ETV Bharat / state

ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీ... ఒకరి దుర్మరణం

author img

By

Published : Jun 17, 2020, 12:53 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం, భూంపల్లి రహదారిపై ఓ ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఒకటినొకటి ఢీకొన్నాయి. ఈ ఘనటలో ఓ వ్యక్తి మృతి చెందగా... ఐదుగురు గాయాలపాలయ్యారు.

one man died in siddipeta road accident
ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీ... ఒకరి దుర్మరణం

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన అజారుద్దీన్, రాకేష్​లు భూంపల్లి నుంచి ద్విచక్రవాహనంపై రుద్రారం వస్తున్నారు. రవి, మల్లేశం, నరేష్, మహేశ్​లు ట్రాలీ ఆటోలో భూంపల్లి బయలుదేరారు. మార్గమధ్యలో ద్విచక్రవాహనం, ట్రాలీ ఆటోలు ఒకటినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అజారుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందగా... మిగిలిన వారంతా గాయపడ్డారు.

స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన అజారుద్దీన్, రాకేష్​లు భూంపల్లి నుంచి ద్విచక్రవాహనంపై రుద్రారం వస్తున్నారు. రవి, మల్లేశం, నరేష్, మహేశ్​లు ట్రాలీ ఆటోలో భూంపల్లి బయలుదేరారు. మార్గమధ్యలో ద్విచక్రవాహనం, ట్రాలీ ఆటోలు ఒకటినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అజారుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందగా... మిగిలిన వారంతా గాయపడ్డారు.

స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.