ETV Bharat / state

ఇంటర్​లో మెరుగైన ఫలితాలు సాధించాలి: మంత్రి హరీశ్​ - మంత్రి హరీశ్​రావు తాజా వార్తలు

సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలల​ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలవాలని మంత్రి హరీశ్​రావు సూచించారు. పట్టణంలోని టీటీసీ భవన్​లో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Minister Harish suggested to techers that Better results in Inter
ఇంటర్​లో మెరుగైన ఫలితాలు సాధించాలి: మంత్రి హరీశ్​
author img

By

Published : Dec 7, 2019, 9:43 AM IST

సిద్దిపేట జిల్లాలోని జూనియర్ కళాశాలల విద్యార్థులు ఫలితాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని... ఆ దిశగా అధ్యాపకులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్​లో ప్రభుత్వ జూనియర్​ కళాశాలల అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


గత సంవత్సరం పదో తరగతి ఫలితాలలో జిల్లా రెండో స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

మరోవైపు ఇంటర్​ విద్యార్థుల్లో 65 శాతం మంది మాత్రమే పాసవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులు స్నేహితులతో... సామాజిక మాధ్యమాలలో కాలం గడుపుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు.

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థులు మంచి మార్కులతో పాసయ్యేలా కళాశాలల అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఇంటర్​లో మెరుగైన ఫలితాలు సాధించాలి: మంత్రి హరీశ్​

ఇదీ చూడండి : మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం

సిద్దిపేట జిల్లాలోని జూనియర్ కళాశాలల విద్యార్థులు ఫలితాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని... ఆ దిశగా అధ్యాపకులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్​లో ప్రభుత్వ జూనియర్​ కళాశాలల అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


గత సంవత్సరం పదో తరగతి ఫలితాలలో జిల్లా రెండో స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

మరోవైపు ఇంటర్​ విద్యార్థుల్లో 65 శాతం మంది మాత్రమే పాసవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులు స్నేహితులతో... సామాజిక మాధ్యమాలలో కాలం గడుపుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు.

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థులు మంచి మార్కులతో పాసయ్యేలా కళాశాలల అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఇంటర్​లో మెరుగైన ఫలితాలు సాధించాలి: మంత్రి హరీశ్​

ఇదీ చూడండి : మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం

Intro:TG_SRD_72_06_JUNIYAR COLLEG PY SAMISHA_SCRIPT_TS10058


యాంకర్: సిద్దిపేట జూనియర్ విద్యార్థులు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలి ఆ దిశగా జూనియర్ కళాశాల అధ్యాపకులు పనిచేయాలని హరీష్ అన్నారు. సిద్దిపేట టిటిసి భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు.


Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..... సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాలలో ఎక్కడ ఉన్న స్థానాన్ని గత సంవత్సరం సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాలు రెండో స్థానానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవడమే మా లక్ష్యం పదవ తరగతి ఫలితాలలో 99% సాధిస్తే ఇంటర్ లో మాత్రం 65 శాతానికి పడిపోయాం దాదాపు 35 శాతం విద్యార్థులు ఇంటర్లో ఫెయిల్ గ్రామాలకు తిరిగి వెళ్ళి పోతున్నారు.


Conclusion:గ్రామాల నుంచి 100 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే కేవలం 20 శాతం మంది మాత్రమే పోటీ పరీక్షలు రాసే స్థాయి కలిగి ఉంటున్నారు మిగతా 80 శాతం మంది అరకొర చదువు మాత్రమే నేర్చుకుంటున్నారు. ప్రైవేటు రంగంలో ఎదగడానికి అవకాశం హద్దు ఆ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దే లేక పోతున్నాం. ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులు స్నేహితులతో సామాజిక మాధ్యమాలలో కాలం గడుపుతున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు సిద్దిపేట తొలి స్థానంలో నిలవాలని మన లక్ష్యం పెట్టుకుని ఆ విధంగా విద్యార్థులకు నేర్పించడం హరీష్ రావు జూనియర్ కళాశాల అధ్యాపకులు ఆదేశాలు జారీ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.