సిద్దిపేట జిల్లాలోని జూనియర్ కళాశాలల విద్యార్థులు ఫలితాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని... ఆ దిశగా అధ్యాపకులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గత సంవత్సరం పదో తరగతి ఫలితాలలో జిల్లా రెండో స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
మరోవైపు ఇంటర్ విద్యార్థుల్లో 65 శాతం మంది మాత్రమే పాసవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులు స్నేహితులతో... సామాజిక మాధ్యమాలలో కాలం గడుపుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు.
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థులు మంచి మార్కులతో పాసయ్యేలా కళాశాలల అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి : మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం