సిద్దిపేట జిల్లా కేంద్రంలో పట్టణ వాసులు, మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్లతో కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి హరీశ్రావు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ హోలీ పండగను ఘనంగా జరుపుకోవాలని.. అందరి జీవితాల్లోకి కొత్త వెలుగులు రావాలని, జీవితం రంగులమయం కావాలని ఆకాంక్షించారు.