వసంత పంచమి సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ గ్రామంలోని శ్రీ సరస్వతీ దేవి ఆలయాన్ని మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వసంత పంచమి రోజున సర్వస్వతి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుందని... చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే.. పిల్లలు జ్ఞాన రాశులు అవుతారని అర్చకులు తెలిపారు. ఆలయ ఆవరణలో రాగి, చీకటి, పాల దోనెలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మెట్లు నిర్మించేందుకు రూ.10లక్షలు వెచ్చిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి: జోగులాంబ ఆలయంలో కేసీఆర్ కుటుంబం..