సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన బట్టు నరేష్(32) అనే యువకుడు, స్థానిక రామసముద్రం సమీపంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు కలరు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న దుబ్బాక ఎస్ఐ మన్నె స్వామి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండీ: అబ్బాపూర్ తండాలో విద్యుదాఘాతంతో రైతు మృతి