ETV Bharat / state

మాస్కులు పంపిణీ చేసిన ఏసీపీ మహేందర్​ - Husnabad ACP Mahender on masks

ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని హుస్నాబాద్​ ఏసీపీ మహేందర్ పేర్కొన్నారు. అంగడి బజార్​లో రైతులు, వ్యాపారులకు మాస్కులు పంపిణీ చేశారు. పట్టణంలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ACP Mahender distributed the masks
ACP Mahender distributed the masks
author img

By

Published : Apr 9, 2021, 5:27 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంగడి బజార్​లో రైతులు, వ్యాపారులు, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని ఏసీపీ మహేందర్​ సూచించారు. ఈ మేరకు ఎస్సై శ్రీధర్​తో కలిసి మాస్కులు పంపిణీ చేశారు.

సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఆదేశానుసారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలో వారం రోజులుగా కరోనా జాగ్రత్తలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్​తో శుభ్రపరచుకోవాలన్నారు. సినిమా హాళ్లు, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, వైన్స్​ల వద్ద గుమిగూడకూడదని చెప్పారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంగడి బజార్​లో రైతులు, వ్యాపారులు, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని ఏసీపీ మహేందర్​ సూచించారు. ఈ మేరకు ఎస్సై శ్రీధర్​తో కలిసి మాస్కులు పంపిణీ చేశారు.

సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఆదేశానుసారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలో వారం రోజులుగా కరోనా జాగ్రత్తలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్​తో శుభ్రపరచుకోవాలన్నారు. సినిమా హాళ్లు, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, వైన్స్​ల వద్ద గుమిగూడకూడదని చెప్పారు.

ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.