సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు స్వచ్ఛ గ్రామంగా రెండు సార్లు జాతీయ స్థాయి అవార్డు పొందడంపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇరుకోడు గ్రామస్థులకు చెత్తబుట్టలను మంత్రి పంపిణీ చేశారు. ఇరుకోడులో గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో ప్లాస్టిక్ను నిషేధించాలని ప్రజలకు తెలియజేశారు. బతుకమ్మ పండగ తర్వాత అందరూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మంత్రి సూచించారు.
మటన్, చికెన్ షాపు దగ్గరికి, కూరగాయల దుకాణానికి వెళ్లేప్పుడు స్టీల్ డబ్బాలు తీసుకెళ్లాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. గ్రామంలో పేదవారు చనిపోతే రూపాయి ఖర్చు లేకుండా గ్రామపంచాయతీయే దహన సంస్కారాల కోసం రూ.పది వేల ఇచ్చి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తుందన్నారు. అనంతరం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలలో భాగంగా పారిశుద్ధ్యంపై కొన్ని ఇళ్ళలోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు సన్మానం చేశారు.
ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం