సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలంలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. అర్జున్పట్ల గ్రామాన్ని చెర్యాల మండలంలో కలపాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని నిరసనగా పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం నుంచి మూడు ఓట్లు మాత్రమే నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన గిరిజనులు