ETV Bharat / state

జోరుగా భాజపా ప్రచారం.. దౌల్తాబాద్​లో బైకు ర్యాలీ

author img

By

Published : Oct 18, 2020, 1:57 AM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి హరీశ్​రావు అన్యాయం చేశారని దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్​రావు ఆరోపించారు. దౌల్తాబాద్​ మండలకేంద్రంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బైకు ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

dubbaka election canvassing by bjp
జోరుగా భాజపా ప్రచారం.. దౌల్తాబాద్​లో బైకు ర్యాలీ

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు.. తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దౌల్తాబాద్​ మండల కేంద్రంలో ద్విచక్రవాహన ర్యాలీను నిర్వహించారు. గులాబీ పార్టీకి ఓట్లు వేయకపోతే పింఛన్లు తొలగిస్తామని తెరాస శ్రేణులు తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ రఘునందన్​రావు ఆరోపించారు.

సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని.. మంత్రి హరీశ్​రావు దుబ్బాకలో ఎందుకు చేయలేదంటూ రఘునందన్​రావు ప్రశ్నించారు. ఉపఎన్నికల్లో భాజపాకు ఓటు వేసి గెలిపిస్తే.. దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు.. తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దౌల్తాబాద్​ మండల కేంద్రంలో ద్విచక్రవాహన ర్యాలీను నిర్వహించారు. గులాబీ పార్టీకి ఓట్లు వేయకపోతే పింఛన్లు తొలగిస్తామని తెరాస శ్రేణులు తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ రఘునందన్​రావు ఆరోపించారు.

సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని.. మంత్రి హరీశ్​రావు దుబ్బాకలో ఎందుకు చేయలేదంటూ రఘునందన్​రావు ప్రశ్నించారు. ఉపఎన్నికల్లో భాజపాకు ఓటు వేసి గెలిపిస్తే.. దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండిః దుబ్బాక ఉపఎన్నిక... 12 నామినేషన్ల తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.