సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ సమీపంలో తెల్లవారుజామున కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పరువెళ్ళ గ్రామానికి చెందిన రామకృష్ణా రెడ్డి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
కేసు విషయమై హుస్నాబాద్ కోర్టుకు హాజరవడానికి బైక్ మీద వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.