రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి కూడలిలో యాదవ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. గొర్రెల కోసం డీడీలు కట్టి ఏడాది దాటినా వితరణలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై గొర్రెలమందతో సంప్రదాయ నిరసన చేశారు.
సీఎం కేసీఆర్ స్పందించి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. యాదవ సంఘం నాయకుల రాస్తారోకోతో హైదరాబాద్-ముంబై మార్గంలో వాహన రాకపోకలు స్తంభించాయి. కోహీర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారి రాస్తారోకో విరమింపజేసి.. రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కేటీఆర్