సంగారెడ్డి జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లోని జాతీయ రహదారి పక్కన ఉన్న మొబైల్ ఫోన్ దుకాణంలో చోరీ జరిగింది. షాపు పైన ఉన్న రేకులు తొలగించి సుమారు లక్ష విలువ చేసే చరవాణులను దుండగులు ఎత్తుకెళ్లారు.
ఆదివారం రాత్రి దుకాణం మూసి వెళ్లిన యజమాని సోమవారం ఉదయం వచ్చి చూసే సరికి రేకులు తొలగించి ఉన్నందున అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న ట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు.
ఇవీ చూడండి: దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్ విచారణ