ETV Bharat / state

దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్​ వ్యవస్థ - petrol bunk inaugrated by home minister in sangareddy

నేరాల నియంత్రణ, భద్రతలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు.

సంగారెడ్డిలో హోంమంత్రి మహమూద్​ అలీ పర్యటన
author img

By

Published : Oct 31, 2019, 4:57 PM IST

సంగారెడ్డిలో హోంమంత్రి మహమూద్​ అలీ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్ని శాఖలకు సమాన ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్ల శాఖలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవని కొనియాడారు.

జైళ్లలో తయారు చేసే ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని హోంమంత్రి తెలిపారు. నాణ్యత బాగుందని అందరూ మెచ్చుకుంటే.. చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 బంకుల్లో 300 మంది ఉపాధి పొందుతున్నట్లు స్పష్టం చేశారు. 2013-14లో జైళ్ల శాఖ ఆదాయం 5 కోట్లు ఉంటే.. ఇప్పుడు 20 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

సంగారెడ్డిలో హోంమంత్రి మహమూద్​ అలీ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్ని శాఖలకు సమాన ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్ల శాఖలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవని కొనియాడారు.

జైళ్లలో తయారు చేసే ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని హోంమంత్రి తెలిపారు. నాణ్యత బాగుందని అందరూ మెచ్చుకుంటే.. చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 బంకుల్లో 300 మంది ఉపాధి పొందుతున్నట్లు స్పష్టం చేశారు. 2013-14లో జైళ్ల శాఖ ఆదాయం 5 కోట్లు ఉంటే.. ఇప్పుడు 20 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

TG_SRD_57_31_HOME_MINISTER_OPEN_AB_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) నేరాల నియంత్రణ, భద్రతలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవుడి దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని.. ఆయన అన్ని శాఖలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. జైళ్లలో మనం చేస్తునన్ని కార్యక్రమాలు దేశంలో మరెక్కడా చేయడం లేదని.. జైళ్లలో తయారు చేసే ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతుందన్నారు. పెట్రోల్ బంక్ లలో క్వాలిటీ, క్వాంటిటీ బాగుందని అందరూ మెచ్చుకుంటే.. చాలా సంతోషంగా ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా 19బంకులలో 300మంది ఉపాధి పొందుతున్నట్లు స్పష్టం చేశారు. 2013-14సంవత్సరాలలో జైళ్ల శాఖ ఆదాయం 5కోట్ల ఉంటే.. ఇప్పుడు 20కోట్లకు పెరిగిందనని పేర్కొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.