సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గిరిజన బాలుర ఆశ్రమ ప్రాథమికోత్సవ పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంతో పాటు నీళ్లచారు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో నాసిరకం భోజనం వడ్డీస్తున్నారని ఆరోపించారు. వార్డెన్ సక్రమంగా రావడం లేదని తెలిపారు. పాఠశాల వద్ద గంటకు పైగా ఆందోళకు దిగారు.
నాసిరకం భోజనం వల్ల తమ ఆరోగ్యసమస్యలు తలెత్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ తహసీల్దార్ దశరథ్ సింగ్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు వడ్డించే వంటకాలను పరిశీలించారు. ఈ విషయంలో విచారణ జరిపించి విద్యార్థులకు మంచి భోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:కదులుతున్న రైలులో విన్యాసం- యువకుడి దుర్మరణం