ETV Bharat / state

అన్ని చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్​

కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వెంటనే హోమ్ క్వారంటైన్​కు వెళ్లాలని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు సూచించారు.

author img

By

Published : May 17, 2020, 4:57 PM IST

sangareddy district latest news
sangareddy district latest news

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో ఓ ఇంట్లో తండ్రి, కుమారులకు కరోనా పాజిటివ్ రావడం వల్ల జిల్లా పాలనాధికారి హనుమంతరావు సందర్శించారు. గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

హోమ్ క్వారంటైన్​లో ఉన్న వారందరూ అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు. జిల్లా యంత్రాగం ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు . కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ చర్యలతోపాటు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్​ పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో ఓ ఇంట్లో తండ్రి, కుమారులకు కరోనా పాజిటివ్ రావడం వల్ల జిల్లా పాలనాధికారి హనుమంతరావు సందర్శించారు. గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

హోమ్ క్వారంటైన్​లో ఉన్న వారందరూ అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు. జిల్లా యంత్రాగం ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు . కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ చర్యలతోపాటు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్​ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.