సహోద్యోగిపై ప్రధానోపాధ్యాయుడు దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రిన్సిపల్ మధుసూదన్ రాత్రి రెండున్నరకు తన గదికి వచ్చి దాడి చేసినట్టు బాధితుడు సాయిరెడ్డి తెలిపారు.
తాను నిద్రిస్తున్న సమయంలో ప్రిన్సిపల్ వచ్చి తలుపు కొట్టారని, తీయగానే తీవ్రంగా గాయపరిచాడని ఆరోపించాడు. రక్తం మరకలతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు.
ఇదీ చూడండి: కరోనా వైరస్పై పోరుకు భారత్ సరికొత్త వ్యూహం