ఓ ఇంట్లో గుట్టుగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం జ్యోతినగర్లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల్లో తొమ్మిది మంది పేకాట రాయుళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి నుంచి 19 వేల150 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని... కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో గుట్టుగా పేకాడుతూ దొరికిపోయారు...!
అసలే బయట లాక్డౌన్. చేద్దామంటే పనులూ లేవు... బయటికెళ్దామంటే పోలీసుల భయం. ఇంట్లో ఒక్కరమే ఉంటే టైంపాస్ కావట్లేదనుకున్నారో ఏమో... తొమ్మిది మంది కలిసి ఓ ఇంట్లో దుకాణం పెట్టారు. గుట్టుగా పేకాట అడుకుంటున్నారు. ఎలా తెలిసిందో... చడీచప్పుడు చేయకుండా వచ్చారు. అరెస్టు చేసి తీసుకుపోయారు పోలీసులు.
ఇంట్లో గుట్టుగా పేకాడుతూ దొరికిపోయారు...!
ఓ ఇంట్లో గుట్టుగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం జ్యోతినగర్లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల్లో తొమ్మిది మంది పేకాట రాయుళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి నుంచి 19 వేల150 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని... కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!