సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో ఎంతో ఓర్పుతో, ధైర్యంతో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వైరస్ కట్టడిలో చేయడంలో వీరి పాత్ర అభినందనీయమన్నారు.
ఇంటింటి సర్వే చేపడుతూ, ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను సేకరించడం ప్రశంసనీయమన్నారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో వైరస్ పూర్తిగా అదుపులో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులతో పాటు, లేని వారికి బియ్యం, నగదు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.