పోస్టుమార్టం కోసం వెళితే సిబ్బంది లంచం డిమాండ్ చేసిన ఘటన... సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు ఈనాడు-ఈటీవీ భారత్కు చిక్కాయి. వట్పల్లి మండలం పల్వట్లతో కలుషిత ఆహారం తిని ముగ్గురు మృతి చెందారు. శవపరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసుల సాక్షిగా మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్ చేశారు.
రెండు మృతదేహాల పోస్టుమార్టం కోసం రూ.5 వేలు ఇవ్వాలని తేల్చి చెప్పారు. చివరికి రూ.4 వేలు ఇచ్చేందుకు మృతుల బంధువులు ఒప్పుకున్నారు. బాధితులపై సిబ్బంది వేధింపులను ఈనాడు-ఈటీవీ భారత్... సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన సూపరింటెండెంట్... సిబ్బంది తీసుకున్న లంచాన్ని బాధితులకు ఇప్పించారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ఆర్బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ'