ETV Bharat / state

సంక్షేమ పథకాల అమలుతీరే నిదర్శనం: మహిపాల్​రెడ్డి

ప్రత్యేక తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో అన్నదానికి నేటి సంక్షేమ పథకాల అమలుతీరే నిదర్శనమని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, అమీన్ పూర్ మండలాల పరిధిలో 646 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

author img

By

Published : Sep 24, 2020, 11:05 AM IST

mla vmahipal reddy
సంక్షేమ పథకాల అమలుతీరే నిదర్శనం: మహిపాల్​రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కితాబిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, అమీన్ పూర్ మండలాల పరిధిలో 646 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో అన్నదానికి నేటి సంక్షేమ పథకాల అమలుతీరే నిదర్శనమన్నారు.

వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతు పింఛన్లను గతం కంటే ఎక్కువ మొత్తంలో మంజూరుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

ఇవీచూడండి: వచ్చే నెల 3 నుంచి అందుబాటులోకి ధరణి సేవలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కితాబిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, అమీన్ పూర్ మండలాల పరిధిలో 646 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో అన్నదానికి నేటి సంక్షేమ పథకాల అమలుతీరే నిదర్శనమన్నారు.

వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతు పింఛన్లను గతం కంటే ఎక్కువ మొత్తంలో మంజూరుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

ఇవీచూడండి: వచ్చే నెల 3 నుంచి అందుబాటులోకి ధరణి సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.