సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మయూరినగర్లో కరోనా కేసులు నమోదు కావడం వల్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పర్యటించారు. కాలనీలో తండ్రీ కొడుకులకు కొవిడ్-19 సోకడం వల్ల వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబంలో ఉన్న ఇతర సభ్యులు, పని మనిషి, చుట్టుపక్కల ఇళ్ల వాళ్లకి సైతం పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారు ముందుకు వస్తే.. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధి నారాయణ ఐఐటీ క్యాంపస్లోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నవారిని మంత్రి పరామర్శించారు. వారితో మాట్లాడి అందుతున్న సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, జిల్లా పాలనాధికారి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్ కేసులు