ETV Bharat / state

'నల్లధనమంతా భాజపా నాయకుల జేబుల్లోకే పోయింది'

author img

By

Published : Nov 24, 2020, 8:37 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, భారతీనగర్​లలో మంత్రి హరీశ్​రావు రోడ్ షో నిర్వహించారు. అనంతరం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ యువతకు అన్యాయం చేసిన భాజపాకు ఎందుకు ఓటేయాలని మంత్రి ప్రశ్నించారు.

harish rao participated in ghmc election campaign  in patancheru
harish rao participated in ghmc election campaign in patancheru
'నల్లధనమంతా భాజపా నాయకుల జేబుల్లోకే పోయింది'

ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తానని అధికారంలోకి వచ్చిన భాజపా... ఉన్నవాటిని సైతం ఊడిపోయేలా చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, భారతీనగర్ అభ్యర్థులు కుమార్ యాదవ్, సింధుకు మద్దతుగా మంత్రి రోడ్ షో నిర్వహించారు. అనంతరం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ యువతకు అన్యాయం చేసిన భాజపాకు ఎందుకు ఓటేయాలని మంత్రి ప్రశ్నించారు.

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని తెలిపారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తా అన్న భాజపా... ఇప్పటివరకు ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లదనం మొత్తం తెల్లగా మారి భాజపా నాయకుల బ్యాంకుల్లోకి, జేబుల్లోకే పోయిందన్నారు. 400 ఎకరాల్లో ఐటీ పార్కు, సుల్తాన్​పూర్​లోని 200 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్... ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన సీఎం కేసీఆర్​కు వచ్చిందన్నారు. శివానగర్​లో కూడా ఎల్ఈడీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: భాజపా నేతలు హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారా..?

'నల్లధనమంతా భాజపా నాయకుల జేబుల్లోకే పోయింది'

ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తానని అధికారంలోకి వచ్చిన భాజపా... ఉన్నవాటిని సైతం ఊడిపోయేలా చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు దుయ్యబట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, భారతీనగర్ అభ్యర్థులు కుమార్ యాదవ్, సింధుకు మద్దతుగా మంత్రి రోడ్ షో నిర్వహించారు. అనంతరం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ యువతకు అన్యాయం చేసిన భాజపాకు ఎందుకు ఓటేయాలని మంత్రి ప్రశ్నించారు.

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని తెలిపారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తా అన్న భాజపా... ఇప్పటివరకు ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లదనం మొత్తం తెల్లగా మారి భాజపా నాయకుల బ్యాంకుల్లోకి, జేబుల్లోకే పోయిందన్నారు. 400 ఎకరాల్లో ఐటీ పార్కు, సుల్తాన్​పూర్​లోని 200 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్... ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన సీఎం కేసీఆర్​కు వచ్చిందన్నారు. శివానగర్​లో కూడా ఎల్ఈడీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: భాజపా నేతలు హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.