ETV Bharat / state

సంగారెడ్డిలో కరోనా కలకలం.. కొత్తగా 13 కేసులు

author img

By

Published : Jul 13, 2020, 12:15 PM IST

హైదరాబాద్​ నగరాన్ని ఆనుకుని ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలో ఓ కరోనా బాధితుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కాగా కొత్తగా 13 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.

corona cases in sangareddy
సంగారెడ్డిలో కరోనా కలకలం.. కొత్తగా 13 కేసులు నమోదు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణానికి చెందిన కరోనా సోకిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని అధికారులు కొవిడ్ నిబంధనల ప్రకారం ఖననం చేశారు.

అలాగే నియోజవర్గంలోని పటాన్​చెరు పట్టణం, ముత్తంగి, ఇస్నాపూర్, బీడీఎల్, చెట్ల పోతారం వంటి ప్రాంతాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదవగా జిన్నారం మండలం దోమడుగు, రామచంద్రపురం పరిధిలో మూడేసి కేసులు చొప్పున నమోదయ్యాయి. అమీన్పూర్ మున్సిపాలిటీలో రెండు కేసులు నమోదు అయ్యాయి. కాగా కొత్తగా 13 మందికి వైరస్​ నిర్ధరణ అయిందని వైద్య అధికారులు వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణానికి చెందిన కరోనా సోకిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని అధికారులు కొవిడ్ నిబంధనల ప్రకారం ఖననం చేశారు.

అలాగే నియోజవర్గంలోని పటాన్​చెరు పట్టణం, ముత్తంగి, ఇస్నాపూర్, బీడీఎల్, చెట్ల పోతారం వంటి ప్రాంతాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదవగా జిన్నారం మండలం దోమడుగు, రామచంద్రపురం పరిధిలో మూడేసి కేసులు చొప్పున నమోదయ్యాయి. అమీన్పూర్ మున్సిపాలిటీలో రెండు కేసులు నమోదు అయ్యాయి. కాగా కొత్తగా 13 మందికి వైరస్​ నిర్ధరణ అయిందని వైద్య అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.