ETV Bharat / state

ఈనెల 21న పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్​ సమీక్ష

సంగారెడ్డిలో ఈనెల 21న మున్సిపల్​ ఎన్నికలపై కాంగ్రెస్​ సమీక్షించనుంది. 32 జిల్లాల్లోని పరిస్థితులపై మూడు దశల్లో చర్చించనున్నారు. ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ బాధ్యులు ఇతర నేతలు హాజరుకానున్నారు.

author img

By

Published : Jul 19, 2019, 8:21 PM IST

ఈనెల 21న పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్​ సమీక్ష
ఈనెల 21న పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్​ సమీక్ష

ఈనెల 21న మున్సిపల్​ ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని మున్సిపాలిటీలపై మూడు దశల్లో పీసీసీ సమీక్ష జరపనుంది.

ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల పరిధిలోని పురపాలికలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 వరకు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగాం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని మున్సిపాలిటీలపై సమీక్షించాలని హస్తం నేతలు నిర్ణయించారు.

ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలు, మాజీలు, ఆఫీస్​ బేరర్లు, సమన్వయకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఈనెల 21న పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్​ సమీక్ష

ఈనెల 21న మున్సిపల్​ ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని మున్సిపాలిటీలపై మూడు దశల్లో పీసీసీ సమీక్ష జరపనుంది.

ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల పరిధిలోని పురపాలికలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 వరకు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, జనగాం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని మున్సిపాలిటీలపై సమీక్షించాలని హస్తం నేతలు నిర్ణయించారు.

ఈ భేటీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలు, మాజీలు, ఆఫీస్​ బేరర్లు, సమన్వయకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.